1 Let’s say it’s 7.25pm and you’re going home (alone of course) after an unusually hard day on the job.
2 You’re really tired, upset and frustrated.
3 Suddenly you start experiencing severe pain in your chest that starts to drag out into your arm and up in to your jaw. You are only about five km from the hospital nearest your home.
4 Unfortunately you don’t know if you’ll be able to make it that far.
5 You have been trained in CPR, but the guy who taught the course did not tell you how to perform it on yourself.
6 HOW TO SURVIVE A HEART ATTACK WHEN ALONE?
Since many people are alone when they suffer a heart attack without help, the person whose heart is beating improperly and who begins to feel faint, has only
about 10 seconds left before losing consciousness.
7 However, these victims can help themselves by coughing
repeatedly and very vigorously. A deep breath should be taken before each cough, and the cough must be deep and prolonged, as when producing sputum from deep inside the chest.
A breath and a cough must be repeated about every two
seconds without let-up until help arrives, or until
the heart is felt to be beating normally again.
8 Deep breaths get oxygen into the lungs and coughing
movements squeeze the heart and keep the blood circulating. The squeezing pressure on the heart also helps it regain normal rhythm. In this way, heart attack victims can get to a hospital.
9 Tell as many other people as possible about this. It could save their lives!!
10 A cardiologist says If everyone who gets this mail
kindly sends it to 10 people, you can bet that we’ll save at least one life.
11 Rather than sending jokes, please..contribute by forwarding this mail which can save a person’s life….
12 If this message comes around you ……more than once…..please don’t get irritated……U need to be happy that you have many friends who care about you & being reminded of how to tackle….Heart attacks….AGAIN…
Happy world pawanism day
అక్టోబర్ 11 విజయదశమి తో పాటు మరో పండగ కూడా జరుపుకోవటం విశేషం.. అదే ''వరల్డ్ పవనిజం డే''.
అప్పుడెప్పుడో 1996 ఇదే రోజున అంటే అక్టోబర్ 11 న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా తెలుగు సినీ వినిలాకాశానికి ఒక మెరుపు పరిచయమైంది. ఆరోజు కొణిదెల చిరంజీవి గారి తమ్ముడుగా పరిచయం అయిన ఒక బక్కపలచని కుర్రాడు. అతనే పవన్ కళ్యాణ్.. ఆరోజు మొదలైన ప్రస్థానం ''సుస్వాగతం'' తో అభిమానులను ఆహ్వానించి ''తోలిప్రేమతో'' యావత్ తెలుగు యువత హృదయాలని కొల్లగొట్టి, తన అభిమానులని ''తమ్ముడు'' గా చేసుకొని, ''బద్రి'' "ఖుషి" లాంటి సినిమాలతో తనకే సాధ్యమైన ప్రత్యేకమైన స్టైల్ ని చూపించి, "గబ్బర్ సింగ్" తో తన పొగరును పరిచయం చేసి, "అత్తారింటికి దారేది" అంటూ "సర్దార్" తో తన తమ్ముళ్ళకు యెనలేని ఆనందాన్ని పంచుతూ, పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో మాత్రమే కాదు అసలు సిసలైన రియల్ హీరో అని నిరూపించే తన వ్యక్తిత్వమే తన అశేష అభిమాన గణానికి కారణం. ఇంతటి ఆనందాన్ని, పంచే తమ రియల్ హీరో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 11 న మొదటి చిత్రం తో తెరంగేట్రం చేయటం వలన ఆ రోజుని గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 11 న "వరల్డ్ పవనిజం డే" ను అభిమానులు పండుగ లా జరుపుకుంటారు.
జై హింద్
విజయదశమి ప్రాశస్త్యము :
దసరాఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ
పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు
విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.
ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో
వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు
పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి
దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు.
ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక
యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని
ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు
ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో
కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం
జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ
పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ
ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం
ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక
పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ
సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన
దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని
పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య
భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
మహిషాసురమర్ధిని
దైత్యవంశానికి
ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి
బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు
కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు
ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు
సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక
తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు
ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం
అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని
మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన
మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమే చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు.
దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని
ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై
జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా
అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును,ఇంద్రుడు వజ్రాయుధమును,వరుణ దేవుడు పాశము,బ్రహ్మదేవుడు, అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల
ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది.
మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత
మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి
చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి
మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము
దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.
ఈ విజయదశమి అందరి జీవితాల్లోనూ విజయాయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ...
విజయ దశమి శుభాకాంక్షలు..
జూదం వలలో చిక్కుకు పోతున్న వైనం గెలిచేదెవరు....?
ఆడ... మగ తేడా లేకుండా విస్తరిస్తున్న వ్యసనం
ఆన్లైన్ గేమింగ్ పేరుతో సాగుతున్న జూదానికి బానిసలవుతున్నవాళ్ల సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, గృహిణులు ఆన్లైన్ పేకాటకు అలవాటు పడుతున్నారు. రూ.వందల నుంచి రూ.వేల వరకూ పేకాటలో పెడుతుంటే... ఆన్లైన్ జూదం స్థాయి రూ. వందల కోట్లకు చేరుతోంది. గతేడాది మన దేశంలో ఈ తరహా వ్యాపార స్థాయి రూ.2,650 కోట్లుగా ఉంటే రాబోయే నాలుగేళ్లలో రూ.5,200 కోట్లకు చేరుతుందని ఫిక్కీ అంచనా! అంటే పేకాటఆడేవాళ్లు ఏ స్థాయిలో పెరగబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చేతిలో మొబైల్ ఉన్నాచాలు తమ ఆన్లైన్ రమ్మీ వెబ్సైట్ ద్వారా ఆడేసుకోవచ్చంటూ వూదరగొట్టే గేమింగ్ కంపెనీల ప్రకటనల వలలో జనం చిక్కుపడిపోతున్నారు. ఆన్లైన్ జూదానికి అలవాటుపడ్డవాళ్లు అదే లోకమన్నట్లు కంప్యూటర్ తెరలోకి తలదూర్చేస్తున్నారు. దీంతో కుటుంబ బంధాలు దెబ్బ తింటున్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్నారు.
* విజయవాడకు చెందిన 40ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి ఆరు నెలలుగా ఆన్లైన్లో రమ్మీ ఆడేందుకు అలవాటుపడ్డాడు. ఆఫీసు నుంచి ఇంటికి రావటం ఆలస్యం కంప్యూటర్ ఆన్ చేసుకొని అర్ధరాత్రి వరకూ అదే పేకాట. తెల్లవారి లేచాక కూడా రెండు గంటలపాటు అదే ఆట. భోజనం, టిఫిన్ అన్నీ కంప్యూటర్ ముందే. గెలిచింది తక్కువ.. ఓడింది ఎక్కువ కావడంతో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర రూ.లక్షలు అప్పులు చేసి నిండా మునిగాడు.. * హైదరాబాద్లో ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో సరదాగా ఆన్లైన్లో రమ్మీ ఆట మొదలుపెట్టి వ్యసనంగా మార్చుకొంది. క్రెడిట్ కార్డు బిల్లు మోత మోగడంతో ఇంట్లో అసలు విషయం వెల్లడై గొడవలు మొదలయ్యాయి. హైదరాబాద్లో ఉద్యోగం వెదుక్కొనేందుకో, కొత్త కోర్సులు చేసేందుకో వచ్చిన యువకులు కొందరు వూరి నుంచి తెచ్చుకొన్న సొమ్ముతో ఆన్లైన్ పేకాడి ఇబ్బందులుపడుతున్నారు.
* తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి పేకాడే అలవాటు ఉంది. క్రమంగా తన ఆఫీస్లో కూర్చొనే ఆన్లైన్లో ఆడటం మొదలుపెట్టాడు. వ్యాపారం మీద దృష్టి తగ్గడంతో దెబ్బ తినడంతో నష్టాల పాలయ్యాడు. ఇవి మచ్చుక్కి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కంప్యూటర్ తెర మీద పేకాట ఆడటం కొత్త ఏమీ కాదు. 1990 నుంచి దశకం నుంచీ ఉన్నదే. అయితే ముందుగా కంప్యూటర్లో లోడ్ చేసిన గేమ్ల్లో భాగంగా ఎవరికివాళ్లే కాలక్షేపానికి ఆడేవారు. ఇక్కడ డబ్బులు రావడం పోవడం అనే సమస్య ఉండేది కాదు. ఇప్పుడు మనుషులు అదృశ్యంగా ఉంటారు తప్పించి ఆటంతా ప్రత్యక్షంగా కనిపించే స్థాయికి క్రమంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధి చెందడంతో గత తొమ్మిదేళ్లుగా దేశంలో ఆన్లైన్లో రమ్మీ, మూడుముక్కలాటలాంటివి ఆడించే వెబ్సైట్లు వచ్చాయి.
ఇటీవల కాలంలో ఇవి ఇబ్బడిముబ్బడిగా రావడమే కాకుండా టీవీల్లో, వెబ్సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు చేసుకోవడం ద్వారా మార్కెట్ పరిధిని పెంచుకొన్నాయి. పేకాడుకొనేందుకు భాగస్వాములు దొరకలేదా ఫర్వాలేదు మా వైబ్సైట్ ఉందని ఒకరు.. మీరు బాత్రూమ్లో ఉన్నా మొబైల్లో పేకాడుకోండి అనో.. కారులో వెళ్తూ కార్డ్స్ ఆడమనో ఇంకొరు చెబుతారు.
ఇంకా పాత తరహా చేత్తో పేకముక్కలు పట్టుకొని ఏం ఆడతారు కొత్త తరహాలోకి రమ్మని చెప్పే వెబ్సైట్ మరొకటి. నేను ఆన్లైన్లో పేకాడి బోలెడు గెలిచాను అంటూ ఒకరు... ఇలా జూదం వైపు ఆకట్టుకొనేలా సాగే ఈ ప్రకటనల్లో సినీ నటులు కూడా కనిపిస్తున్నారు.
ఈ వలలో చిక్కిన వారు రూ.10 నుంచి రూ.వందలు, రూ.వేలల్లో పేకాటలో పెడుతున్నారు. తాము పెడుతున్నది తక్కువ మొత్తంలా కొందరికి తొలుత అనిపించినా క్రమంగా భారీగా నష్టపోయామని తరవాత వాపోతున్నారు.
ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ ఎర.. ఆన్లైన్లో రమ్మీకి సంబంధించిన వెబ్సైట్లు ‘ఫ్రీ టు ప్లే’, ‘పే టు ప్లే’ రెండు ఆప్షన్లు ఇస్తున్నాయి ఉచితంగా కూడా పేకాట ఆడుకొనే వెసులుబాటు ఉంటుంది. తొలుత ఉచితంతో వూబిలోకి దించి క్రమంగా డబ్బులు పెట్టే స్థాయికి తీసుకెళ్లి ఇక అక్కడ నుంచి బయటపడలేని విధంగా పాతాళంలోకి అదిమేస్తాయి. విద్యార్థులు, గృహిణులు, యువత ఎక్కువగా ఆడుతున్నారు. గత రెండేళ్లుగా ఆన్లైన్లో పేకాడేవాళ్ల సంఖ్య బాగా పెరిగినట్లు మార్కెట్వర్గాలు చెబుతున్నాయి. క్రెడిట్/డెబిట్ కార్డులు వాడేవాళ్లు పెరగడం, విద్యార్థులకీ, గృహిణులకీ వీటిని ఇంట్లోవాళ్లు ఇవ్వడంతోపాటు మొబైల్లో యాప్లు ఉండటం, ఇంటర్నెట్ వాడే అవకాశం ఉండటం ఇందుకు దోహదపడ్డాయి. వారాంతపు ఆకర్షణలు.. ఆన్లైన్లో పేకాడించే వెబ్సైట్లు జూదగాళ్లను ఆకట్టుకొనేందుకు రకరకాల స్కీమ్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వారాంతపు ఆకర్షణగా ఒక్కో గేమ్ రూ.5 వేలు అంటూ ప్రకటించేవి కొన్నయితే... మరికొన్ని దీపావళి ధమాకా అంటూ స్కీమ్లు పెడుతున్నాయి. ఆన్లైన్లో రమ్మీ టోర్నమెంట్ అంటూ భారీ బహుమతి మొత్తాల్ని కూడా ప్రకటిస్తున్నారు. దీంతో ఆన్లైన్ జూదగాళ్లు ఎగబడుతున్నారు. కొన్ని వెబ్సైట్లు సింగపూర్లో రమ్మీ టోర్నమెంట్ ఆడొచ్చు అంటూ ప్రకటించాయి. దీంతో వెబ్సైట్ చూసేవాళ్లు పెరగడంతో మార్కెట్లో వాటి విలువ భారీగా పెరుగుతోంది.
ఆట గెలిచేదెవరు? ఒకళ్లు హైదరాబాద్లో మరొకరు అమలాపురంలో ఇంకొరు సిడ్నీలో మరొకరు దిల్లీలో... ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్లోకి వచ్చి పేకలు పంచుకొంటారు. ఆడుతుంటారు. ఒకళ్లు గెలుస్తారు. అలా గెలిచినవాళ్లు ఎక్కడివాళ్లు? వాళ్ల అసలు పేరేమిటి? లాంటి వివరాలు తెలుసుకొందామంటే సాధ్యం కాదు. వెబ్సైట్ తరఫునే ఒకళ్లు ఆడుతుంటారని... వాళ్లే ఎక్కువ ఆటలు గెలుస్తుంటారనే అనుమానాన్ని ఆన్లైన్ జూదరులు వ్యక్తం చేస్తున్నారు. వైబ్సైట్వాళ్లకే అందరి ఆట, ముక్కలు చూసే అవకాశం ఉంటుందన్నది వాళ్ల సందేహం. నిస్సిగ్గుగా టి.వి. సామజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ మరీ జనాల సొమ్ము బహిరంగంగా దోచుకొనే ఇలాంటి వ్యాపార సంస్థల నుంచి ప్రజల్ని మన దేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది..ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ దోపిడీ జూదాన్ని నిషేధించాల్సిందిగా కోరుకుంటూ...
జై హింద్
HIV బాధితులకు శుభవార్త.....
HIV వ్యాధి నుండి పూర్తిగా బయటపడిన వ్యక్తిగా ఒక 44ఏళ్ళ బ్రిటిష్ వ్యక్తి చరిత్ర సృష్టించాడు.
HIV ని రూపుమాపేందుకు శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త థెరపీ లో అంతకు ముందు
చేసిన రక్త పరీక్షలో HIV-పాజిటివ్ గా తేలిన వ్యక్తి తాజాగా జరిపిన రక్త పరీక్షలో
వైరస్ అవశేషాలు ఏమాత్రం కనిపించలేదు.
ఒకవేళ ఈ థెరపీ వలన నిజంగా వ్యాధి నయం అయితే తొందరపడి ఎవరికీ చెప్పకుండా
జాగ్రత్త వహించమని ముందుగానే సూచించినా తనకు
అందించిన చికిత్సలో విశేషమైన పురోగతి వొచ్చింది అని ఆ స్వచ్చంద కార్యకర్త వెల్లడించారు.
రెండు దశలలో పూర్తయ్యే ఈ ప్రతిష్టాత్మక థెరపీ లో ఎంపిక చేసిన 50 మందిలో వ్యాధి
పూర్తిగా నయం అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
రోగి శరీరంలోని ప్రతీ భాగం లో చికిత్సకు దొరకని లోలోపల నిద్రాణమైన HIV కణాలను
కూడా గుర్తించి నాశనం చేయటంలో ఈ చికిత్స ఎంతో విశిష్టమైనది.
బ్రిటన్ కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రిసెర్చ్ సంస్థ యొక్క
చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన మార్క్ శామ్యూల్స్ మాట్లాడుతూ HIV నిర్మూలన కోసం
చేసిన ప్రయోగాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇది ఒక పెద్ద సవాలు లాంటిది. ఇవి
ఇంకా ప్రారంభ రోజులు మాత్రమే. కానీ గొప్ప
పురోగతి సాధించాం" అని సండే టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ
ప్రతిష్టాత్మక పరిశోధనకి సంభందించిన ఆర్ధిక సహకారాన్ని మొత్తం ఈ సంస్థ భరించడం
విశేషం.
ఈ ప్రతిష్టాత్మక పరిశోధనలో పాలుపంచుకున్న బ్రిటన్ కి చెందిన యూనివర్సిటీ అఫ్
ఆక్స్ ఫోర్డ్ , కేంబ్రిడ్జ్ , ఇంపీరియల్ కాలేజ్ లండన్ , యూనివర్సిటీ కాలేజ్ లండన్
మరియు కింగ్స్ కాలేజీ లండన్ తదితర 5 యూనివర్సిటీ లకు చెందిన ప్రముఖ డాక్టర్లు
మరియు శాస్త్రవేత్తల యొక్క విశేషమైన కృషి
ఫలితమే ఈ విజయం.
HIV అనగా హ్యూమన్ ఇమ్మ్యునో డెఫిషియన్సీ వైరస్. ముఖ్యంగా ఇది లైంగిక చర్య లేదా
వ్యాధి సోకిన సూదుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా ఇది మనిషి శరీరాన్ని
వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ లతో పోరాడే t-సెల్స్ లేదా t-లిమ్ఫోసైట్స్ ను నాశనం
చేయటం ద్వారా మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రపంచ
వ్యాప్తంగా 36.7మిలియన్ మంది HIV తో జీవిస్తున్నారు.
ఇంపీరియల్ కాలేజ్ లండన్ యొక్క కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు ప్రోఫెసర్ అయిన సారా
ఫిడ్లేర్ మాట్లాడుతూ ఈ పరీక్షలను 5 సంవత్సరాల వరకు సమర్ధవంతంగా కొనసాగిస్తాం. HIV మీద పోరాటం సాగిస్తూనే ఉంటాం అని సండే
టైమ్స్ తో అన్నారు.
source: the INDEPENDENT
ఉరీ ఘటన అనంతరం యావత్ భారతావని హృదయాలు రగిలిపోతున్న వేళ కొంతమంది వివాదాస్పద
వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా అలనాటి సీనియర్ నటుడు ఓం పురి ఈ విషయమై
అత్యంత వివాదాస్పదమైన బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేసారు. ఒక జాతీయ టీవీ ఛానల్
నిర్వహించిన ముఖాముఖిలో భారత్ లోని పాక్ నటులకు మద్దతుగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలను
మీరు సమర్ధిస్తున్నారా? అని అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. మీరు ఇండియా పాక్ లను శతాబ్దాలుగా
కొట్టుకున్న ఇజ్రాయిల్ , పాలస్తినాలా చూడాలనుకుంటున్నారా? ఇది రెండు దేశాలు
విడిపోయే విషయం కాదు కుటుంబాలు విడిపోయే విషయం. మన దేశంలో 22 కోట్ల ముస్లిం కుటుంబాలు
నివశిస్తున్నాయి . ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మనదేశం రెండో
స్థానంలో ఉంది. ఇప్పటికీ నేను పాక్ నటులతో కలిసి పని చేస్తాను" అని చెప్పుకొచ్చారు.
బారాముల్లా, ఉరీ దాడుల్లో చనిపోయిన సైనికుల గురించి ప్రస్తావించగా.. "వారిని సైన్యంలో
చేరమని మనం బలవంతం చేసామా ? ఎవరు ఆర్మీలో చేరి ఆయుధాలు పట్టుకోమన్నారు?" అని సంచలన జవాబు ఇచ్చారు ఓం పురి.
ఇలాంటి సిగ్గు మాలిన వ్యక్తులు దేశంలో ఉండాల్సిన అవసరం ఉందా.. వీడ్ని పూరి
చేసి పాకిస్తాన్ కి పార్సెల్ పంపిస్తే అక్కడ పూరీలు అమ్ముకుంటూ బతుకుతాడు అని
సోషల్ మీడియాలో తమదైన శైలిలో కామెంట్స్ చేసారు నెటిజన్లు.. నిజమే మరి అంతటి సీనియర్ నటుడు అయ్యుండి కేవలం తను నటించిన పాకిస్తానీ
సినిమా కోసం ఇలాంటి బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం ఎంతైనా గర్హనీయం.
జై హింద్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల అదిరిపోయే
కాంబినేషన్ లో 'జల్సా', 'అత్తారింటికి దారేది' రూపొందిన విషయం తెలిసిందే. వీరిద్దరి
సూపర్ కాంబినేషన్ లో మరో అదిరిపోయే చిత్రం రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గోపాల
గోపాల దర్శకుడు డాలీ దర్సకత్వం వహిస్తున్న
"కాటమ రాయుడు" చిత్రం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా
పూర్తయిన తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా
నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ గా "దేవుడే దిగివస్తే" అనే పేరును పరిశీలిస్తున్నట్టుగా
సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ని దైవం గా
భావించే అభిమానులకు పండగే మరి.
విద్యార్ధులకు బోధన విషయంలో ఒక్కో యూనివర్సిటీకి
ఒక్కో స్టైల్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు
మంచి బోధనా విధానంతో విద్యార్ధులకు మంచి ర్యాంకులు వొచ్చేలా చేసి వార్తల్లో
నిలుస్తుంటాయి. మరికొన్ని చారిత్రాత్మక నేపధ్యంలో పేరు తెచ్చుకుంటాయి. కానీ..
చైనాలోని చెంగ్డు ప్రాంతంలో ఉన్న సిచువాన్ నార్మల్ యూనివర్సిటీ మాత్రం అక్కడ
పాఠాలు చెప్పే లెక్చరర్ల వల్ల ప్రత్యెక గుర్తింపు సంపాదించింది. ఎలా అంటే.. ఆ
యూనివర్సిటీలో అందమైన 16మంది అందగత్తెలు విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు
మరి.
టీచర్ కోర్సు చేస్తున్న
విద్యార్ధులకు పాఠాలు చెప్పే పాతికేళ్ళ లెక్చరర్ల ఫోటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో యూనివర్సిటీ యాజమాన్యం పోస్టు చేసింది. ఆ
ఫోటోలు వైరల్ గ మారాయి. అందరూ అబ్బా ఎంత అందం అనుకుంటూ కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ.. వారు లెక్చరర్లు
అని తెలిసి అవాక్కవుతున్నారట. ఇంత అందమైన అమ్మాయిలను అధ్యాపకులుగా నియమించుకోవడానికి
వర్శిటీ పెద్ద కారణాలే చెబుతోంది మరి. అవేంటంటే..
అందమైన అమ్మాయిలు పాఠాలు చెబుతుంటే...
విద్యార్ధులు కనురెప్ప వేయకుండా బుద్ధిగా విన్తున్నారట. ఎక్స్ట్రా క్లాసులు
వినటానికి పోటీ పడి మరీ వస్తున్నారట . అక్కడ లెక్చరర్ ఉద్యోగంలో చేరాలంటే..
అమ్మాయిలు బాగా చదవడమే కాదు.. అందంగా కనిపించాలట. అందమైన అమ్మాయిలకు యూనివర్సిటీ భారీ
వేతనాలతో ఎర్ర తివాచి వేసి ఆహ్వానిస్తోంది మరి....
పార్లమెంట్ ఆవరణలో ప్రస్తుతంవిక్రయిస్తున్న ఆహార పదార్ధాల ధరలను పెంచేందుకు యోచిస్తున్నారు.
ఈ మేరకు లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్లు దీనిపై ఒక కమిటీని నియమించారు.
రైల్వే కేటరింగ్ విభాగం నుంచి పార్లమెంట్ ఆవరణలో ఆహార పదార్థాల విక్రయాలు
జరుగుతున్నాయి. ఏపి జితేందర్ రెడ్డి అధ్యక్షతన 10మంది లోక్సభ, 5మంది రాజ్యసభ సభ్యులను సంబంధిత కమిటీలో
సభ్యులుగా నియమించారు. బయట మార్కెట్లలో కంటే పార్లమెంట్ క్యాంటీన్లో ధరలు
తక్కువగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తడంతో జనవరిలో ఈ అంశం పరిశీలనకు వొచ్చింది.
దీనిపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బయటి ధరలను సమీక్షిస్తూ పార్లమెంట్ కాంటీన్ లోని ధరలలో
మార్పులు చేయాలని సూచించారు. తాజా ధరల ప్రకారం
రూ. 18ఉన్న వెజ్ ధాలిని రూ.30, అలాగే రూ.33
నాన్వెజ్ ధాలి రూ.60కి, రూ.61 గా ఉన్న త్రీ కోర్స్ మీల్ రూ.90కి, రూ.29గా ఉన్న
చికెన్ కర్రీ రూ.40కి విక్రయించనున్నట్టు సమాచారం. అయితే మన నిరుపేద పార్లమెంట్ సభ్యులు పెరిగిన
ధరలను ఎలా భరిస్తారో పాపం.
కొసమెరుపు: మోడీ నాయకత్వం లోని ఎన్డిఏ ప్రభుత్వ పరిపాలనలో దేశంలో అనేక రకాల సంస్కరణలు జరిగాయనటానికి ఇది ఒక నిదర్శనం.
ఐఫోన్7 ప్లస్ నుని కిందకి విసిరేస్తున్న దృశ్యం
ఏంటి అవాక్కయ్యారా..!
మీరు విన్నది నిజమే. ఇక విషయంలోకి వొస్తే....
ఈ హైటెక్ కాలంలో మనిషి తన జీవితమలో ఒక్క ఐఫోన్ అయినా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అనటం లో ఎలాంటి
అతిశయోక్తి లేదు. ఐఫోన్ అనే కాదు మనకు నచ్చిన ఎలాంటి గ్యాడ్జెట్నైనా కంటికి
రెప్పలా కాపాడుకుంటాం. పొరపాటున కిందపడి విరిగిపోతే.. దాని వల్ల కలిగే బాధ
అంతాఇంతా కాదు. అలాంటిది దుబాయ్కి చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద భవనమైన
బుర్జ్ ఖలీఫా 148 వ
అంతస్తు నుంచి ఐఫోన్ 7 ప్లస్
ను కిందకి పడేశాడు. ఎప్పుడెప్పుడు ఐఫోన్ కొంటామా అని ఎంతో మంది ఆశ పడుతుంటే ఇతను
అంత ఖరీదైన ఫోనును ఎందుకు కిందకి విసిరేశాడో తెలీలేదు. పైగా అలా విసిరేస్తుండగా
తీసిన వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. దీనిని చూసినవారంతా అతనెవరో
పిచ్చివాడికి పెదనాన్నలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేశారు. ఆ పిచ్చెంటో మీరూ చుడండి...
This is Atomic
All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.